Breaking News

ఘనంగా కుంకుమ పూజలు,తరలి వచ్చిన మహిళలు

47 Views

ఘనంగా కుంకుమ పూజలు,తరలి వచ్చిన మహిళలు

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల.జిల్లా కేంద్రంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని అంజనీ పుత్ర సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం కుంకుమ పూజలు నిర్వహించేందుకు భక్తులు, మహిళలు తరలి వచ్చారు. వంద ఫీట్ల రోడ్డు వద్ధ అంజనీ పుత్ర సంస్థ కార్యాలయ ఆవరణ లో కొలువైన లంబోదరుని వద్ద మహిళలు కుంకుమ పూజలు నిర్వహించి, ఒకరికొకరు వాయనాలు ఇచ్చి పుచ్చుకున్నారు. గణనాథుని వద్ద మహిళలు కోలాటాలు ఆడి భక్తులను అలరించారు.

ఈ సందర్భంగా అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు వినాయక చవితి పండుగ అద్దం పడుతుందని పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజలు ప్రేమను రాగాలతో కలిసి జరుపుకునే పండుగ వినాయక చవితి అన్నారు. అనంతరం మహిళా మణులతో 3000 మందికి అన్నదానం నిర్వహించారు.

ఈ కార్యక్రమం లో అంజనీ పుత్ర సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు సూరినేని కిషన్, కాసర్ల సదానందం, సంస్థ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *