పెద్దపల్లి పార్లమెంట్
కేంద్రమంత్రి స్థాయి పార్లమెంటరీ ఫెర్టిలైజర్స్ కమిటీ ఛైర్మన్ క్రిటి ఆజాద్ ను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మల్లురవి, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్, అనిల్ యాదవ్ నేడు న్యూ ఢిల్లీలో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ – తెలంగాణ రైతాంగం తీవ్రమైన యూరియా కొరతతో సతమతమవుతున్నారని, రాష్ట్రానికి కేటాయించాల్సిన హక్కైన యూరియా వాటాను కేంద్రం ఇంకా పూర్తిగా అందించలేదని తెలిపారు.
రైతుల కోసం కేంద్రం తక్షణమే చర్యలు తీసుకుని కేటాయించిన యూరియాను వెంటనే తెలంగాణకు పంపించాలి అని కమిటీ ఛైర్మన్ను డిమాండ్ చేశారు.





