మంచిర్యాల జిల్లా.
ర్యాలీ గ్రామంలో 60మంది లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం భూమి పూజ.
పండగల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ.
హజీపూర్ మండల ర్యాలీ గ్రామంలో 60మంది లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం భూమి పూజ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
ఎన్నొ ఏళ్లుగా ఎదురుచూస్తున్న స్వంత ఇంటి కల సాకారం కావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ముందుగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కి ఘన స్వాగతం పలికారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ మీకు ఇంకా ఎన్ని సమస్యలు ఉన్న వాటన్నిటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
