*రామగుండం పోలీస్ కమీషనరేట్*
ప్రజల రద్దీ గల ముఖ్యమైన ప్రదేశాలలో బాంబు స్క్వాడ్ బృందాల తనిఖీలు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్.
భారత సరిహద్దు లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపెల్లి డిసిపి కరుణాకర్ గారి ఆదేశాల మేరకు గోదావరిఖని ఏసిపి ఏం రమేష్ పర్యవేక్షణలో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి ఆధ్వర్యంలో గోదావరిఖని వన్ టౌన్ పరిధిలో గల గోదావరిఖని బస్టాండ్ , మెడికల్ కళాశాల, హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్, జిఎం ఆఫీస్, గౌరవ కోర్ట్ పరిసరాలు మరియు ముఖ్యగా ఎక్కువ జన సంచారం తో రద్దీగా ఉండే ప్రాంతాలలో బాంబు డిస్పోజల్ టీమ్ మరియు డాగ్స్ స్క్వాడ్ బృందాలతో లగేజ్ మరియు పార్సిల్ లను, బ్యాగ్ లను తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇట్టి తనిఖీలలో గోదావరిఖని ఏసిపి మరియు ఇన్స్పెక్టర్ స్వయంగా పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా ఏసీపి మాట్లాడుతూ… ప్రజల రక్షణ, భద్రత చర్యలలో భాగంగా డాగ్ మరియు బాంబు స్క్వాడ్ లతో తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే, వస్తువులు కనిపిస్తే,సందేహాస్పదంగా ఉన్న వాహనాల సమాచారాన్ని పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఏసీపి తెలిపారు.
ఇట్టి తనిఖీ లలో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎస్సైలు భూమేష్ రమేష్ శ్రీనివాసులు, కోటేశ్వర్, బాంబు స్వాడ్, డాగ్ స్వాడ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
