ఆదిలాబాద్ జిల్లా.
ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ నియోజకవర్గం.
ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి మంత్రి సీతక్క తో కలిసి నివాళులు అర్పించిన మంచిర్యాల శాసన సభ్యులు ప్రేమ్ సాగర్ రావు.
అనంతరం ఏర్పాటు చేసిన ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ మా నాన్న పేరు మీద కీ,శే, శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అమరవీరుల కుటుంబాలకు ప్రతి సంవత్సరం 20,000/ రూపాయలు అందజేస్తానని చెప్పారు .. మరోసారి ఇంద్రవెల్లి అమరవీరులకు నా జోహార్లు .
ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి శ్రీ సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.





