ఆర్ఎంపీలపై మెడికల్ కౌన్సిల్ కేసులు నమోదు
మార్చ్ 01
తెలంగాణలో నకిలీ( ఆర్.ఎం.పి ), (పీ ఎం పీ) లకు మెడికల్ కౌన్సిల్ అధికారులు షాకిచ్చారు.నకిలీ వైద్యులపై తరచూ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు.( ఆర్ఎంపి )ల వద్దకు వచ్చే రోగులకు ఇష్టారీతిన యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్,ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా ప్రజారోగ్యానికి పెనుముప్పు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 400 మందికి పైగా కేసులు నమోదు చేసినట్లు మెడికల్ కౌన్సిల్ ప్రకటించింది.





