మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి.
బెల్లంపల్లి బార్ లో దాడి ఆరుగురు కి రిమాండ్.
బెల్లంపల్లి కాల్ టెక్స్ ఏరియాలో ఓ బార్ లో జరిగిన గొడవలో దాడికి పాల్పడిన మరో ముగ్గురు కోట సౌశీల్, చింత సాయికుమార్ మరియు కాలం నవీన్ గురువారం రాత్రి రిమాండ్ కు తరలించినట్లు గా బెల్లంపల్లి సిఐ ఆప్టులుద్దీన్ తెలిపారు. తాండూరు మండలానికి చెందిన వంశీని ఆరుగురు బార్లో బీరు సీసాలతో దాడి చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ నెల 9న అల్లి సాగర్ రత్నం సోము మరియు మామిడి అన్నమయ్య లను అరెస్టు చేశారు.





