మంచిర్యాల జిల్లా.
పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ
మందమర్రి మండల కేంద్రంలోని ముదిరాజుల కుల ఆరాధ్య దైవం పెద్దమ్మతల్లి గుడి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు నెల్లి రాజలింగు గరిగే సుమన్ ముదిరాజ్, కొలిపాక సదానందం ముదిరాజ్ తెలిపారు. మంగళవారం కులస్తులతో కలిసి ఆలయ నిర్మాణానికి పనులు నిర్వహించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముదిరాజ్ ల కుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి గుడి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వారు మాట్లాడుతూ..ముదిరాజ్ కులస్తుల ఏ కార్యక్రమం చేసిన కుల ఆరాధ్య దైవంగా భావించే పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకోవాలని అలాగే అన్ని గ్రామాల్లో పెద్దమ్మ గుడు లు నిర్మించుకోవాలని, భవిష్యత్ లో ప్రభుత్వం కూడా అన్ని గ్రామాల్లో పెద్దమ్మ గుడులు అధికారికంగా నిర్మించాలని కోరారు.పెద్దమ్మ గుడులు ఐక్యమత్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి అని,జాతి ఐక్యత అభివృద్ది కోసం పాటు పడతాయని అన్నారు.ఈ కార్యక్రమం మందమర్రి ముదిరాజ్ కుల పెద్దలు కొమురయ్య, పిల్లి మల్లయ్య, కుందాల ఓదెలు, అంకం రాములు, భీమరి సదానందం, చెప్పాల రమేష్, బండారి కనకయ్య, పిల్లి మల్లేష్, బండారి రమేష్, పూలు కుమార్ స్వామి, పిల్లి శ్రీనివాస్, నెల్లి వీరన్న తదితరులు పాల్గొన్నారు..
