Breaking News

ఆర్టీసీ బస్సు ప్రమాదం క్షతగాత్రులను పరామర్శించిన కలెక్టర్

157 Views

మెరుగైన వైద్యం అందించాలి

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

క్షతగాత్రులను పరామర్శించిన కలెక్టర్

రాజన్న సిరిసిల్ల, జనవరి -31

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.
గంభీరావుపేట మండలం గోరంటల గ్రామ శివారులో కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు సిరిసిల్లకి వస్తుండగా , గోరంటాల బ్రిడ్జి మూలం వద్దకు రాగానే బ్రేకులు ఫెయిలై ఎదురుగా ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు గాయాలు కాగా, సిరిసిల్ల లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి( జీజీహెచ్) కు తరలించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆసుపత్రికి చేరుకుని, క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

No Slide Found In Slider.

Poll not found