ప్రాంతీయం

పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబులకు శుభాకాంక్షలు తెలిపిన సీపీ

40 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

ఆరుగురు ఏఆర్ కానిస్టేబుల్ లకు హెడ్ కానిస్టేబుల్ లుగా పదోన్నతి.

పదోన్నతుల ద్వారానే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం : పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,

పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుల్ లకు శుభాకాంక్షలు తెలిపిన సీపీ.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి కమీషనరేట్ అర్ముడ్ విభాగం లో పనిచేస్తున్న ఎఆర్ కానిస్టేబుల్ లు హెడ్ కానిస్టేబుల్ లుగా పదోన్నతి పొందిన సందర్బంగా అట్టి అధికారులకు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ శ్రీనివాస్ ఐపిఎస్.,(ఐజి)  వారి కార్యాలయంలో అభినందింఛి వారి ర్యాంక్ పదోన్నతి చిహ్నంను అలకరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ…. పదోన్నతులతోనే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం వ‌స్తుంద‌ని ఎలాంటి రిమార్క్ లేకుండా మిగిలిన సర్వీసును పూర్తి చేసి విధుల్లో మంచి పనితీరు కనబరిచి మరిన్ని పదోన్నతులు పొందాలని అన్నారు. పోలీసు శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని, పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని సీపీ  అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కష్టపడి పనిచేసి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రజలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, కష్టపడి పని చేస్తే ఎప్పటికైనా మంచి గుర్తింపు లభిస్తుందని, ఇప్పటివరకు ఎలాంటి క్రమశిక్షణతో విదులు నిర్వహించారో అదేవిధంగా మిగతా సర్వీస్ పూర్తి చేసి మరిన్ని పదోన్నతులు పొందాలని సూచించారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటాం, మానసికంగా శారీరకంగా ఒత్తిడిని దూరం చేయడానికి ప్రతి ఒక్కరూ శ్రమించాలని, మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ సందర్భంగా సీపీ  తెలియజేశారు

ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏఆర్ ఏ సి పి సుందర్ రావు, ఆర్ ఐ వామన మూర్తి, రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం, స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్