ముస్తాబాద్, జనవరి 20 (24/7న్యూస్ ప్రతినిధి): విద్యార్థులు మండల కేంద్రంలో రోడ్డు ర్యాలీ నిర్వహించే మాసోత్సవాల్లో భాగంగా ఎస్సై చిందం గణేష్ పాల్గొన్నారు. ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడక్కడ విషాదకర సంఘటనలు జరుగుతున్నాయి. రహదారి భద్రత చాలా కీలకమైనదని రహదారి భద్రతను అభ్యసించడానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు ట్రాఫిక్ నిబంధనల గురించి నేర్పడానికి తమ వంతు ప్రయత్నం చేయాలి రహదారి భద్రత మనల్ని మనం సురక్షితంగా ప్రాణాలకు ఎలాంటి హని జరగకుండా జాగ్రత్తలు పాటించాలని విధి విధానాల గురించి అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో పాటు ర్యాలీలో పోలీసులు పాల్గొన్నారు.
