ప్రాంతీయం

నాంపల్లి అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి

171 Views

హైదరాబాదులోని నాంపల్లి కెమికల్ గోడౌన్లో ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో చిక్కుకున్న తొమ్మిది మంది మృతి చెందినట్లు తెలిసింది.ఇప్పటికీ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్యారేజ్‌ ఉండటంతో కారు రిపేర్‌ చేస్తుండగా మంటలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

అదే సమయంలో అక్కడ డీజిల్‌, కెమికల్‌ డ్రమ్ములు ఉండటంతో వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పారు.

ఈ తరునంలోనే నాంపల్లి బజార్‌ఘాట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.

తక్షణమే పటిష్టమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *