మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లా, పాత మంచిర్యాలలోని శాలివాహన పవర్ ప్లాంట్ భూములను ఎవరు కొనొద్దని పవర్ ప్లాంట్ కార్మికులు ఆదివారం కంపెనీ గేటు ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ అధ్యక్షుడు కుంటాల శంకర్ మాట్లాడుతూ కంపెనీ మూసివేసి 26 నెలలుగా కార్మికులకు ఎలాంటి బెనిఫిట్స్ చెల్లించకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం వెంటనే స్పందించి ఇకనైనా కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కార్మికులకు చెల్లించాల్సిందిగా అంతవరకు కంపెనీ భూములను ఎవరికి యాజమాన్యం వారు అమ్మవద్దని మరియు ఎవరు కొనవద్దని హెచ్చరించారు.





