ప్రాంతీయం

ప్రపంచానికి వెళ్తురునిచ్చిన మహనీయుని విగ్రహం అంధకారంలోనేనా…

28 Views

ముస్తాబాద్, ఏప్రిల్ 17 (24/7న్యూస్ ప్రతినిధి): మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో వీధిలైట్లను ఏర్పాటు చేయకుండా ఉన్నవాటిని పట్టించుకోకుండా అంధకారంలోకి నెట్టేసిన అధికారులు. గత ప్రభుత్వం ఈఎల్‌డీ వీధిదీపాలు ఏర్పాటుచేసి గ్రామాల్లో వెలుగులు వెలిగిస్తే నాటినుంచి నేటివరకు కొన్ని ఎలియిడి లైట్లు చెడిపోగా వాటిని పట్టించుకోకుండా పూర్తిగా గాలికి వదిలేశారు. మండలంలో అనాలోచిత నిర్ణయాలు, కక్షసాధింపు చర్యలతో మండల ప్రజలను ఇటు వాహనదారులను అంధకారంలోకి నెట్టేశారు. ఇటీవల ఏప్రిల్14న అంబేద్కర్ జయంతి రోజున మహనీయుని విగ్రహాన్ని అందంగా పూలతో అలంకరించి పూలమాలువేసి ఘనంగా వేడుకలు నిర్వహించి చేతులు దులుపుకున్నారు. ఆ మహానేత గురించి పలు నాయకులు, అధికారులు వర్ణనా తీరంగ ప్రసంగించారు. ఆ మహానీయుడు కారు చీకట్లో ఉన్నాడని ఏ నాయకుడు ,ఏ అధికారి గ్రహించిన పాపాన పోలేదు. మండలంలో కొన్నిచోట్ల పట్టపగలు లైట్లు వెలుగుతూ విద్యుత్ వృధాకాగా బల్బు అప్పటికే వెలుగుతున్న బల్బువిద్యుత్ వేడికి ఇటు భానుని వేడికి పాడైపోతాయని తెలిసినప్పటికీ ఆపట్టింపు లేకపోలేదు. ఇటీవల చిరు వ్యాపారస్తులతో మొదలులుకొని మిగతా వ్యాపారస్తుల మీద చర్యలు తీసుకున్నప్పటికీ అపారమైన విద్యావంతుడు, సంఘ సంస్కర్త, ఆర్థికవేత్త మరియు న్యాయ కోవిదుడు ఆయన, భారత సమాజంలో బహుజనులు అట్టడుగువర్గాల హక్కులకోసం పోరాడి, ప్రజాస్వామ్య విలువలతో కూడిన రాజ్యాంగాన్ని అందించిన మహాగొప్ప మహనీయుడు విగ్రహాం ముందు ఏళ్లుగడిచిన వెళ్తురురాని లైట్లపోలు.. సూర్యాస్తమయానికి చీకట్లో ఉండడం ఏంటని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మండలంలో ప్రధాన రహదారి పొడవునా డివైడర్ వై ఇదివరకే లైట్ల కొరకే వేసిన మెటల్ పోళ్లకు లైట్లు సరిచేసి పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *