ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో ఆడ పులి సంచారం

145 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలోని ముల్కల్ల అడవుల్లో ఆడ పులి తిరుగుతుందని  ట్రాఫిఇంగ్ కెమెరాకు చిక్కిన ఆధారంగా అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కిరిమెరి జోడోఘాట్ అటవీ ప్రాంతాల్లో మూడు సంవత్సరాలుగా సంచరించిన ఈ పులి లక్షేటపేట్ రేంజ్ క్వారీ మేడారం అటవీ ప్రాంతాల్లోకి వచ్చిందని గుర్తించారు.

గత నెలలో మగ పులి తిరిగినదారుల్లో ఇప్పుడు ఆడ పులి రావడంతో అధికారులు అప్రమత్తమై కెమెరాలతో అటవీశాఖ అధికారులు ట్రాప్ చేస్తున్నారు. ఈ రెండు పులులు జత కలిస్తే కవ్వాల్ అడవుల్లో పులి సంతతి పెరిగే అవకాశం ఉన్నది భావిస్తున్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్