మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలోని ముల్కల్ల అడవుల్లో ఆడ పులి తిరుగుతుందని ట్రాఫిఇంగ్ కెమెరాకు చిక్కిన ఆధారంగా అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కిరిమెరి జోడోఘాట్ అటవీ ప్రాంతాల్లో మూడు సంవత్సరాలుగా సంచరించిన ఈ పులి లక్షేటపేట్ రేంజ్ క్వారీ మేడారం అటవీ ప్రాంతాల్లోకి వచ్చిందని గుర్తించారు.
గత నెలలో మగ పులి తిరిగినదారుల్లో ఇప్పుడు ఆడ పులి రావడంతో అధికారులు అప్రమత్తమై కెమెరాలతో అటవీశాఖ అధికారులు ట్రాప్ చేస్తున్నారు. ఈ రెండు పులులు జత కలిస్తే కవ్వాల్ అడవుల్లో పులి సంతతి పెరిగే అవకాశం ఉన్నది భావిస్తున్నారు.





