మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆశా వర్కర్లు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని బుధవారం రోజు ధర్నా చేశారు. ఆశా వర్కర్ల యూనియన్ అధ్యక్షులు మరియు కార్యదర్శిలు సమ్మక్క, శోభ మాట్లాడుతూ….. పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులను వెంటనే చెల్లించాలని అదేవిధంగా 18 వేల రూపాయల వేతనం ఆశ వర్కర్లకు నిర్ణయించాలని మరియు పిఎఫ్ ఉద్యోగ భద్రత లాంటి అన్ని రకాల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.
ఈ ధర్నా కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఆశా వర్కర్ల యూనియన్ అధ్యక్షులు, కార్యదర్శులు మరియు ఆశ వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




