మంచిర్యాల జిల్లా:
చెన్నూర్ పట్టణంలోని చెన్నూర్ కాటన్ కంపెనీలో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు,కలెక్టర్ దీపక్ కుమార్ గారు,పలువురు అధికారులు పాల్గొన్నారు.
రైతులు సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్ముకోవాలని పిలుపునిచ్చిన వివేక్ వెంకటస్వామి.
దాలారులకు తక్కువ ధరలకు పత్తిని అమ్మి రైతులు మోసపోవద్దని తెలిపిన వివేక్ వెంకటస్వామి.
ప్రభుత్వం ఎకరాకు కేవలం 12 క్వింటాల్లు మాత్రమే తీసుకుంటుందని దానిని 16 క్వింటాళ్ల చేయాలని రైతులు కోరగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు.
వివేక్ సార్ కామెంట్స్
సీసీఐ వాళ్ళు చెన్నూర్ ప్రాంతంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
సుమారుగా 7400 రూపాయల మద్దతు ధర కల్పిస్తున్నారు.
సీసీఐ ఇంకా ఎక్కువ పత్తి నీ కొనుగోలు చేయాలని కోరుతున్నాను.
వారి కొనుగోలు కేంద్రాలను కూడా వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ను ఆదేశించిన వివేక్.





