బబ్బోజు రాజు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
సిద్దిపేట జిల్లా నవంబర్ 13
కొండపాక మండలం జప్తి నాచారం గ్రామానికి చెందిన పబ్బోజు రాజు చారి, ఇటీవల అనారోగ్య కారణాల వల్ల మరణించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎస్సీీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ కొమ్ము విజయ్ కుమార్, కుటుంబాన్ని పరామర్షించారు. రాజు చారి,మరణం చాలా బాధాకరం అని, కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. అనంతరం తన సోదరుడు,కొమ్ము మల్లేశం, యొక్క సహకారం తో క్వింటలు బియ్యం అందజేశారు. ఈ కార్యక్రంలో ( ఐ ఎన్ టి యు సి ) జిల్లా అధ్యక్షులు వడ్లకొండ రవీందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఎం. నర్సింలు,గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షులు కిషన్, వీరబ్రహ్మం, బాల్ రాజు,మల్లయ్య, సంజీవ్, విష్ణు, కర్ణాకర్, కృష్ణ, నాగరాజు..తదితరులు పాల్గొన్నారు.





