ప్రాంతీయం

బాసర IIIT లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినికి కుటుంబానికి న్యాయం చేయాలి_ ఏబీవీపీ 

70 Views

బాసర IIIT లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినికి కుటుంబానికి న్యాయం చేయాలి_ ఏబీవీపీ

విద్యార్థి నాయకులపై దాడి చేసిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదిత్య, పవన్.

సిద్దిపేట జిల్లా నవంబర్ 13

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద చౌరస్తా దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

నిర్మల్ – బాసర IIITలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని పరామర్శకు వెళితే విద్యార్థినికి న్యాయం చేయకుండా, న్యాయం కోసం వెళ్లిన ఏబీవీపీ నాయకులను అక్కడున్నా యూనివర్సిటీ అధికారులు ప్రైవేట్ సిబ్బందిని మరియు సెక్యూరిటీలను పెట్టి కనీసం విద్యార్థులని చూడకుండా ఇష్టం వచ్చినట్లు విచక్షణ రహితంగా దాడి చేయడం ఎంతో బాధకరం. ఇలానే గతంలో కూడా ఒక విద్యార్థిని చనిపోతే ఇలానే ఏబీవీపీ విద్యార్థి నాయకులపై దాడి చేయించారు. ఇలా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ప్రాణాలు వారానికి ఒకటి పోయినా కనీసం పట్టించుకోకుండా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మరియు ప్రభుత్వం. బాసర ట్రిపుల్ ఐటీ లో జరుగుతున్న ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యతవహించి, విద్యార్థిని కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఏబీవీపీ విద్యార్థి నాయకులపై దాడి చేసిన సెక్యూరిటీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి, లేదంటే బాసర ట్రిపుల్ఐటీ విద్యార్ధులకు న్యాయం జరిగేంతవరకు ఏబీవీపీ పోరాటం చేస్తూనే ఉంటుంది.ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి పరుశరామ్, రాకేష్, సంతోష్, వినయ్, అభి, ధనుష్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్