ప్రాంతీయం

పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

178 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

*మహారాష్ట్ర అక్రమంగా తరలిస్తున్న సుమారు 07 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు*

రామగుండము కమిషనరేట్ మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి మేకల మండి ప్రాంతంలో ఈ రోజు టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది అనుమానస్పదంగా వెళుతున్న ట్రాలీ వాహనాన్ని ఆపి తనిఖీ చేసి, అక్రమంగా మహారాష్ట్ర కి తరలిస్తున్న 07 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ ను , వాటిని సరఫరా చేసే TS27T 3167 నంబర్ గల ట్రాలి ను స్వాధీన పరుచుకొని నిందితున్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది .

*పట్టుబడిన నిందితుడి వివరములు:*

మోటం రాజు s/o గంగారాం, వయస్సు :35 సంవత్సరాలు, కులం: బుడగ జంగం, occ: వ్యాపారం, మందమర్రి, విద్యానగర్

*స్వాధీ పరుచుకున్న వాటి వివరములు :*

పిడిఎస్ రైస్ 07 క్వింటాళ్ళు వాటి విలువ 21,000 రూపాయలు /-

పట్టుబడిన వాహనాన్ని మరియు నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం మందమర్రి పోలీస్ స్టేషన్ వారికీ అప్పగించడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్