దీపావళి లక్ష్మీదేవి పూజలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో రామకోటి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సంస్థ అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు మాట్లాడుతూ ప్రతి వ్యక్తిలో చీకటి తొలగిపోయి వెలుగులు విరజిమ్మాలని కోరారు. మన జీవితాల్లో కష్టాలు, బాధలు అనే చీకటులను పారద్రోలి, సంతోషం, ఆనందం అనే వెలుగులు ఈ దీపావళి వల్ల రావాలన్నారు.




