Posted onAuthorTelugu News 24/7Comments Off on నేత్రపర్వంగా శ్రీ శివ కేశవుల రథోత్సవాలు..
147 Views
ముస్తాబాద్, అక్టోబర్ 17 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలోని శ్రీ శివ కేశవుల ఆలయాల్లో ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారము స్వామివారి రథోత్సవాలను రంగరంగా వైభవోపేతంగా నిర్వహించారు. వందలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామివారి రథాలను కరసేవతో పురవీధుల్లో ముందుకు సాగుతూ శివ కేశవుల హరిహర నామస్మరణతో ఓరెత్తిస్తూ శోభయాత్ర నిర్వహించారు. పురవీధుల్లోకి తరలి వచ్చిన స్వామివారి రథాలకు పురస్త్రీలు మంగళ హారతులతో నిరాజనం పలికి ఊరంతా పాడిపంటలతో విరసిల్లాలని మొక్కుకున్నారు. దీనికి ముందుగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవతామూర్తులను అర్చకులు విజయసారథి పంతు రథంపై ప్రతిష్టించారు. అర్చకులు పార్థసారథి పంతులు హరీష్ శర్మ పంతులు శ్రీ ఉమామహేశ్వరుల దేవతామూర్తులను రథంపై ప్రతిష్టించారు. ఆలయ చైర్మన్ దేవయ్య, కోశాధికారి ఆగుల్ల రాజేశం, ఆలయ ప్రతినిధులు మాజీ జెడ్పిటిసి మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, రాచమడుగు సంతోష రావు, దోరగొల్ల బాలయ్య, టి రాజు, కూర బిక్షపతి, కూర సంతోష్, రామచంద్రంగౌడ్, కోడె శ్రీను, కుమ్మరి రామచంద్రం, మిడిదొడ్డి శేరయ్య, నాయకులు శ్రీనివాస్ గౌడ్, ఆరుట్ల మహేష్ రెడ్డి, బండారు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
61 Viewsప్రపంచ నేలలో దినోత్సవం సందర్భంగా వ్యవసాయశాఖ, వ్యవసాయ పరిశోధన స్థానం, ఏరువాక కేంద్రం, తోర్నాల వారి అద్వర్యంలో గురువారం రాయపోల్, మంతూర్, వడ్డేపల్లి, అరేపల్లి రైతువేదికలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి ప్రధాన శాస్త్రవేత్త హెడ్ డా. ఎస్.శ్రీదేవి “ప్రపంచ నేలల దినోత్సవం, 2024 (డిసెంబర్, 5) యొక్క ముఖ్య ఉద్యేశం “నేలల కోసం సంరక్షణ, కొలత, మానిటర్” గురించి వివరించి ఆరోగ్యకరమైన నేలల సంరక్షణకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు, సేంద్రియ ఎరువులు, జీవన […]
65 Views.*రామగుండం పోలీస్ కమీషనరేట్* *గ్రూప్ 1 పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,* రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలో గోదావరిఖని లోని చైతన్య డిగ్రీ కళాశాల, పెద్దపల్లి పట్టణ కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మంచిర్యాల జోన్ మంచిర్యాల పట్టణ కేంద్రం లోని RBHV స్కూల్, ప్రభుత్వ బాలుర స్కూల్ లలో ఏర్పాటు చేసిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో […]
235 Viewsడిసెంబర్ 9 అప్పుల బాధతో ఉరివేసుకోని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. కుకునూర్ పల్లి ఎస్ఐ పుష్ప రాజ్ కథనం మేరకు కుకునూర్ పల్లి గ్రామానికి చెందిన అనుమెల్ల రాజు (30) ఫైనాన్స్లో టాక్టర్ కోని నడుపుకుంటూ జీవనం కోనసాగిస్తున్నాడు. టాక్టర్ సరిగ్గా నడవకపోవడంతో ఫైనాన్స్ కట్టడం కోసం తెలిసిన వారి దగ్గర అప్పులు చేసాడు. అప్పుల తీర్చాలేక మనస్థాపంతో ఈ నెల […]