అర్హులైన ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఎన్నికలకు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి.
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మంచిర్యాల గ్రీన్ సిటీ మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీ లోని క్రీడాకారులను మరియు పల్లవి మోడల్ స్కూల్ లో ఉపాధ్యాయులను కలిసి అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరడం జరిగింది. ఓటు నమోదుకు తమ కార్యాలయం 9160603222 నంబర్ సంప్రదిస్తే తామే ఓటు నమోదు చేయడం జరుగుతుందని వారికి తెలుపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బింగి ప్రవీణ్, బియ్యాల సతీష్ రావు, బొలిశెట్టి అశ్విన్ మరియు తదితరులు పాల్గొన్నారు.
