మన్మోహన్ సింగ్ కి నివాళులు అర్పించిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ.
మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు.
భారతదేశ మాజీ ప్రధాని మంత్రి డా.మన్మోహన్ సింగ్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు… వారి ఆత్మకు శాంతి చేకూరాలని మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద వారి చిత్రం పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు, తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, కౌన్సిలర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, కార్యకర్తలు.
అనంతరం కొక్కిరాల సురేఖ మన్మోహన్ సింగ్ వివిధ హోదాల్లో దేశానికి వారు అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
