అన్ని లడ్డులలో తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముఖ్యత ప్రపంచంలో దేనికి లేదంటే అతిశయోక్తి కాదు అని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు.ఈ సందర్బంగా మంగళవారం పత్రికా ముఖంగా మాట్లాడుతూ భక్తులు భక్తిశ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలిస్థానం అన్నారు. కోట్లాది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డును నలుగురికి పంచి తాము స్వీకరించే భక్తుల నమ్మకాన్ని నేడు కొల్లగొట్టారన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తగిన శిక్ష విధిస్థాడన్నాడు. హిందూ సనాతన ధర్మం ఎంతో గొప్పదన్నారు. నేడు హిందూ సమాజం వైవు ప్రపంచ దేశాలు చూస్తున్నాయన్నారు.




