10 సంవత్సరాలనుండి మట్టి గణపతినే పూజిస్తున్న
భవానిలింగం స్వామి భక్తి అమోగం అని
ఘనంగా సన్మానించిన సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు
గజ్వేల్ సెప్టెంబర్ 14
గజ్వేల్ మండలం అహ్మదిపూర్ గ్రామంలో గత 10 సంవత్సరాల నుండి మట్టి గణపతిణే ప్రతిష్టించి పూజిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న భవానిలింగం స్వామిని శనివారం నాడు ఘనంగా సన్మానించారు శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి. రామరాజు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ మట్టి వినాయకులే శ్రేష్టమని గత 10 సంవత్సరాలనుండి ప్రతిష్టించడం అయన భక్తికి నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి భార్గవశర్మ పాల్గొన్నారు.





