*బీజేపీ సభ్యత్వం తీసుకొని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వండి – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి *
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణం అర్చన టెక్స్ చౌరస్తాలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షలు రఘునాథ్ వెరబెల్లి పాల్గొని పలువురికి బిజెపి సభ్యత్వం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పరిపాలనకు దేశ ప్రజలు ఆకర్షితులు అయ్యి మూడో సారి అధికారం ఇచ్చారని దేశాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రజలు అందరూ మోదీ కలిసి రావడానికి బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ 88 00 00 2024 నంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి బీజేపీ సభ్యత్వం పొందాలని మనవి చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ప్రతి బూత్ లో బిజెపి కార్యకర్తలు ఇంటి ఇంటికి వెళ్లి ప్రజలకు బీజేపీ సభ్యత్వం అందజేయడం జరుగుతుంది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్ రావు, పెద్దపల్లి పురుషోత్తం, పురుషోత్తం జాజు, గోలి రాము, ఎనగందుల కృష్ణ మూర్తి, తమ్మినీడి శ్రీనివాస్, జోగుల శ్రీదేవి, బొద్దున మల్లేష్, బింగి ప్రవీణ్, తాజ్ ఖాన్, రవికంటి సత్యనారాయన, మల్యాల శ్రీనివాస్, రెడ్డమల్ల అశోక్, రాకేష్ రెన్వ, అమిరిషెట్టి రాజు, గుర్రాల లావణ్య, పచ్చ వెంకటేశ్వర్లు, బుద్దరపు రాజమౌళి, నాగుల రాజన్న మరియు తతిదరులు పాల్గొన్నారు.
