రాపూరు మండలం పెంచలకోన క్షేత్రం నందు శనివారం సందర్భ శ్రీ స్వామి వారికి అభిషేకం,శ్రీ వార్లకు కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. చెంచులక్షీ, ఆదిలక్ష్మి సమేత నరసింహ స్వామి వారి కి ప్రధానార్చకులు,వేదపండితుల మంత్రోచ్ఛరణలతో కనుల పండుగగా కళ్యాణాన్ని నిర్వహించారు .
ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు.





