శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్బంగా లక్ష్మీదేవి అద్భుత రూపాన్ని ఐదు రూపాల నానాలు(2వేల నానాలు), 10వేలకు పైగా ఉపయోగించి అమ్మ వారి రూపాన్ని రూపొంచి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కలారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అని, అందరు సంతోషాలతో ఉండాలని చిత్రాన్ని చిత్రించి పూజలు నిర్వహించి అమ్మ వారిని వేడుకున్నామ్మన్నారు.
