*రామగుండం పోలీస్ కమీషనరేట్*
*మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలి : పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపిఎస్.,*
*టాక్టీస్, ఫీల్డ్ క్రాఫ్ట్ మరియు మ్యాపింగ్ పై శిక్షణ*
రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి ఆదేశాల మేరకు విపత్కర పరిస్థితులలో శత్రు మూకలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మావోయిస్టు కార్యకలాపాలను జరగకుండా నిరోధించేందుకు రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో మావోయిస్టు ప్రభావిత ప్రాంత పోలీస్ స్టేషన్ పరిధిలో పని చేస్తున్న ఎస్ఐ లకు టాక్టీస్, ఫీల్డ్ క్రాఫ్ట్ మరియు మ్యాపింగ్ పై పూర్తి అవగాహనా కొరకు ఒక్కరోజు తేది :28-0-8-2024 నా ఉదయం 06:00 గంటల నుండి సాయంత్రం 06 గంటల వరకు నిష్ణాతులైన అర్ముడ్ రిజర్వుడు అధికారుల చేత ఎస్ఐ లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, వారి కదలికలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మావోయిస్టు సరిహద్దు ప్రాంతాల్లో వారు ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడకుండా వారిని నివారించాలని తెలిపారు. ఫిజికల్ ఫిట్నెస్, ఆయుధ వినియోగం, అంబుష్, వెహికల్ అంబుష్, టాక్టికల్ మూమెంట్, పోలీస్ స్టేషన్ పరిధిలో ని ప్రాంతం మ్యాప్ పై పూర్తి అవగాహనా కలిగి ఉండాలి,అవసరాన్ని బట్టి అనుసరించాల్సిన టాక్టికల్ ఆపరేషన్స్ వ్యూహం లో మెళకువలతో పరిస్థితులకు అనుగుణంగా ఎలా వ్యవహరించాలి అన్నారు. ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిపి అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమం లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ఏ ఆర్ ఏసీపీ లు ప్రతాప్, సురేంద్ర, ఆర్ ఐ ఆపరేషన్స్ , శ్రీనివాస్, ఆర్ఐ అడ్మిన్ దామోదర్, ఆర్ఎస్ఐలు ప్రవీణ్ వెంకటేష్, అనిల్, హెడ్ కానిస్టేబుల్ అంజయ్య శిక్షణ తరగతులు తీసుకోవడం జరిగింది.
