ముస్తాబాద్, ఆగస్టు 21 (24/7న్యూస్ ప్రతినిధి): చీకోడు గ్రామానికి చెందిన పిట్లచంద్రం కూతురి వివాహానికి గూడెం గ్రామమైనా చిట్టినేని వెంకటేశ్వరరావు మాధవి దంపతులు పుస్తెమట్టెలతో పాటు చీర
25. కిలోల బియ్యం వితరణ చేశారు. బిజెపి ముస్తాబాద్ మండల ప్రధాన కార్యదర్శి బాదనరేష్ వివాహం జరగబోయే నీరుపేద కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బాధ నరేష్ మాట్లాడుతూ చిట్టినేని వెంకటేశ్వరరావు మాధవి దంపతులు పిట్లచంద్రం కుటుంబానికి అందించిన శుభవేళ ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా పిట్లచంద్రం దంపతులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా మండల ప్రధాన కార్యదర్శి గున్నాల రమేష్ గౌడ్, చీకోడ్ బూత్ అధ్యక్షులు ఎల్లం, గూడెం గ్రామ సర్పంచ్ చిట్నేని శ్రీనివాసరావు, అస సురేష్, ప్రభాకర్, చంద్రం, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.




