గొల్లపల్లి యాదవ సంఘం అధ్యక్షుడి ఏకగ్రీవ ఎన్నిక
ఎల్లారెడ్డిపేట మండలం
జులై : 20
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో యాదవ సంఘం పెద్దమనుషుల సమక్షంలో నూతన అధ్యక్షులు , కమిటీ సభ్యులను ఏకగ్రీవంగ ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా శాగ శ్రీనివాస్ యాదవ్ , ఉపాధ్యక్షులుగా అలివెలి సత్తయ్య యాదవ్ , ప్రధాన కార్యదర్శిగా శాగ లక్ష్మణ్ యాదవ్ , క్యాషియర్ పెంజర్ల సత్తయ్య యాదవ్ , ముఖ్య సలహాదారులు , పెంజర్ల ప్రభుదాస్ యాదవ్ , రాగం దేవదాసు , శాగ మల్లేశం యాదవ్ , గాండ్ల శ్రీనివాస్ యాదవ్ లను నియమించడం జరిగింది. గత సంవత్సర కాలంగా యాదవ సంఘం ఉపాధ్యక్షులుగా ఉంటూ పలు కార్యక్రమలలో చురుగ్గా పాల్గొంటూ అందరి మన్ననలు పొందిన శాగ శ్రీనివాస్ ఈసారి అధ్యక్షులుగా ఉంటే బాగుంటదని కుల సభ్యులందరూ భావించి అందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది.





