– రైతులు ప్రజలు సంతోషంగా ఉండాలి
– టిపిసిసి మెంబర్ ధరి పళ్లి చంద్రం
సిద్దిపేట జిల్లా జులై 18
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముత్యాల పోచమ్మ ఆలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు నిర్వహించి కోమటి చెరువు కట్టపై ఉన్న కట్ట మైసమ్మ కు బోనం సమర్పించిన బోయిగల్లి కాలనీవాసులు.
ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా టిపిసిసి కాంగ్రెస్ మెంబర్ దరిపల్లి చంద్రం పాల్గొని ఆయన మాట్లాడుతూ..
ప్రతి ఏటా జరుపుకునే ముత్యాల పోచమ్మ బోనాల ఉత్సవాలను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించుకున్నామని ఆయన అన్నారు.
ఆ అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజలలు ఎల్లవేళలా ఆరోగ్యం తోపాటు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన పేర్కొన్నారు.. వచ్చిన ఏడు నెలల్లోని ఇచ్చిన మాటను నిలబెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఏకకాలంలో రుణమాఫీ ని గురువారం అమలు చేశారని దరిపల్లి చంద్రం హర్షం వ్యక్తం చేశారు.





