(తిమ్మాపూర్ జూలై 14)
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని,నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోరుతూ సోమవారం సచివాలయం ముట్టడికి నిరుద్యోగ యువత పిలుపునివ్వగా, ఆ నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టి తిమ్మాపూర్ సోషల్ మీడియా మండల ఇన్చార్జ్ సుదగోని సదయ్య గౌడ్,బీఆర్ఎస్ యూత్ నాయకుడు దరిపెల్లి వేణులను ఎల్ఎండీ పోలీసులు ఆదివారం సాయంత్రం ముందస్తు అరెస్టు చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముందస్తు అరెస్టులు చేయడం సరికాదని కాంగ్రెస్ ప్రభుత్వం పైన మండిపడ్డారు.




