(తిమ్మాపూర్ జూలై 14)
తిమ్మాపూర్ మండలం పొరండ్ల గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పులు మధ్య పొత్తరాజుల విన్యాసాల మధ్య మహిళలు బోనాలను నెత్తిన ఎత్తుకుని పోచమ్మ ఆలయం వరకు చేరుకుని మొక్కులు సమర్పించుకొని, వర్షాలు బాగా కురిపించి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు..
ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు రెడ్డి అంజి రెడ్డి, సంఘ ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు చింతల మల్లా రెడ్డి, చింతల లక్ష్మారెడ్డి, రజిత, తదితరులు పాల్గొన్నారు .




