సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తలకొక్కుల చంద్రకళ లక్ష్మణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరో తరగతి ఏడవ తరగతి 109 మంది విద్యార్థిని విద్యార్థులకు ఇంగ్లీష్ వర్క్ బుక్స్ మరియు ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజి రెడ్డి, ఉపాధ్యాయులు నరసింహులు గౌడ్, ట్రస్ట్ చైర్మన్ టీ.లక్ష్మణ్ క్యాషియర్ దుర్గాప్రసాద్, కార్యదర్శి మధుసూదన్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




