నిరుపేద విద్యార్థిని ఉన్నత చదువుల కు ఆర్థిక సహాయం
సిద్దిపేట జిల్లా చేర్యాల్ జూన్ 24
సిద్దిపేట జిల్లా చేర్యాల్ మండలం లోని పోతిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం అయినా స్వామి లక్ష్మి ల కుమార్తె ఐశ్వర్య జనగాం లోని ఏబీవీ కాలేజ్ లో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుకుంటుంది… తండ్రి స్వామి రెండు సంవత్సరాల క్రితం మరణించగా తల్లి ఆర్థిక ఇబ్బందుల్లో ఉందనే విషయాన్నీ హెచ్ ఎమ్ . కిష్టయ్య ఉపాధ్యాయులు సంఘ సేవకులు అందె విజయ్ కుమార్ దృష్టికి తీసుకు రాగ మంద భాస్కర్ రెడ్డి, స్నేహ ( హైదరాబాద్ ) దంపతులకు విషయం తెలుపగ అమ్మాయిని తన ఉన్నత విద్య అయిపోయేంత వరకు బాధ్యత తీసుకుంటామని తెలిపారు.
ఈ సంవత్సరం ఫ్రీ 35000, చెల్లించ డానికి ప్రిన్సిపాల్ తో మాట్లాడడం జరిగింది.
ఈ సందర్బంగా అందె విజయ్ కుమార్ దంపతులు సేవా కార్యక్రమాల్లో తమతో కలిసి పని చేయడానికి ముందుకు వచ్చిన స్నేహ దంపతులను అభినందించారు
