– మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
(తిమ్మాపూర్ జూన్ 17)
ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పి లో సూపర్డెంట్ గా పనిచేస్తున్న విజయ్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి తిమ్మాపూర్ మండలం అల్గునూర్ లోని కాకతీయ గేట్ల సమీపంలో ఫోటోలు దిగుతుండగా ప్రమాదవ శాత్తు కొడుకు, కూతురు నీళ్లలో పడడంతో వారిని కాపాడబోయి నీళ్లలో మునిగి చనిపోయిన విజయ్.
కొడుకు కూతుర్ని కాపాడిన జాలరి శంకర్.
మృతుడు కరీంనగర్ పట్టణంలోని రామ్ నగర్ లో నివాసం ఉంటున్నాడు.
కూతురు సాయి నిత్య బీటెక్ చైతన్య కాలేజ్ లో చదువుతుంది. కొడుకు విక్రాంత్ 10th క్లాస్ చదువు తున్నాడు..
సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఘటన స్థలానికి చేరుకొని మృతిచెందిన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం పిల్లలను కాపాడిన జాలర్ శంకర్ ను ఎమ్మెల్యే అభినందించారు..




