మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన శివలింగం
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 17)
సిద్దిపేట జిల్లా, జగదేవపూర్ మండలం, మునిగడప గ్రామ బి ఆర్ ఎస్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్కుక్ మండలం ఎర్రవల్లి లోని వ్యవసాయ క్షేత్రంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా శివలింగం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బి ఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగిందని అన్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలా అయితే ఉన్నారో ఇప్పుడు కూడా అదే ప్రేమ అభిమానం ఉన్న తెలంగాణ అధినేత కేసిఆర్ కు రుణపడి ఉంటామని ఆనందం వ్యక్తం చేశారు.
