కామారెడ్డి కలెక్టర్గా ఆశిష్ సంగ్వాన్ బాధ్యతల స్వీకరణ
కామారెడ్డి జిల్లా జూన్ 15
కామారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ గా 2016 బ్యాచ్ కు చెందిన ఆశిష్ సంగ్వాన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇక్కడ పనిచేస్తున్న జితేష్ వి పాటిల్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లా కలెక్టర్ పనిచేస్తున్న సంగ్వాన్ స్వస్థలం హర్యానా రాష్ట్రంలోని భివాని. అమెరికా లోని జార్జియా టెక్ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ చేసిన అనంతరం 2015 లో జరిగిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో 12 వ రాంక్ సాధించారు. అక్టోబర్ 2023 నుండి నిర్మల్ కలెక్టర్ గా పనిచేస్తున్న సంగ్వాన్ ను కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా నియమించారు. వీరి భార్య కూడా 2016 బ్యాచ్ కు చెందిన ఐ.ఏ.ఎస్. అధికారి క్రాంతి వల్లూరు. ప్రస్తుతం వీరు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. వీరికి ఒక పాప కలదు.
