ముస్తాబాద్, జూన్13 (24/7న్యూస్ ప్రతినిధి): రాజన్న సిరిసిల్ల జిల్లా యువతకు క్రీడా స్ఫూర్తిని నింపడానికి, వారిలోని క్రీడా ఆసక్తిని పెంపొందించడానికి కొండాపూర్, రాంరెడ్డి పల్లే గ్రామాల మధ్య క్రికెట్ పోటీ (టోర్నమెంట్) డా. చిగురు ఆది మలన్ బాబా ముదిరాజ్ మరియు వారి సోదరుడు చిగురు వెంకన్న ముదిరాజ్ ఆధ్వర్యంలో 10.06.2024 నుండి 13.06.2024 వరకు నిర్వహించడం జరిగింది. ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ దాత అయిన డా.చిగురు ఆది మలన్ బాబా ముదిరాజ్ మాట్లాడుతూ, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచాలనే ఆలోచనతో టోర్నమెంట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని యువతరం క్రీడల్లో ఇంకా ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని కోరారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం జూన్ 02 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తాం అని తెలిపారు. ఈ టోర్నమెంట్ కు అయ్యే ఖర్చులను మరియు ఈ క్రికెట్ పోటీలో గెలుపొందిన గౌరీ వినీత్ జట్టుకు మొదటి బహుమతిగా నగదు రూ. 3500/- లతో పాటు ట్రోపిని మరియు యారటి కరుణాకర్ జట్టుకు రెండో బహుమతిగా నగదు రూ. 2000/- లతో పాటు ట్రోపీనీ, బెస్ట్ బౌలర్ గా చిగురు పర్శరాములు గారికి, బెస్ట్ బ్యాట్స్ మన్ గా ఎక్కలదేవి మహేష్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ భాస్కర్ కి శిల్డులను మరియు యువతకి క్రికెట్ కిట్లను డా.చిగురు ఆదిమలన్ బాబా ముదిరాజ్ వారు దాతగా సమకూర్చారు. వారి సోదరుడైన టోర్నమెంట్ నిర్వాహకులు చిగురు వెంకన్న ముదిరాజ మాట్లాడుతూ యువత క్రీడలను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర స్థాయి, ఇంకా పై స్థాయికి ఎదగాలని కోరారు. ఇలాగే ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం అని తెలిపారు. గంత రాజ మాట్లాడుతూ డా.చిగురు ఆది మలన్ బాబా మరియు వారి సోదరుడు చిగురు వెంకన్న లకు యువతను క్రీడా రంగంలో ప్రోత్సహించడం చాలా ఉన్నతమైన విషయం అని కొనియాడారు. యువత కూడా వారు అందించే ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఇలాగే ప్రతి సంవత్సరం టోర్నమెంట్ నిర్వహిస్తాం అని చెప్పిన చిగురు సోదరులకు ధన్యవాదాలు చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోరేపు రాజనర్సయ్య, మాజీ ఎంపీటీసీ రాజు, అనిల్ కుమార్, బాధ నరేష్, గౌరీ సురేష్, గంత రాజు, ఊరేటి రాజు,నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, గంధం మల్లయ్య, నవాబ్,కంటే సాయికుమార్, గ్రామ ప్రజలు మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు.
