వర్షాలు ఈసారి సమృద్ధిగా కురవాలని
11కోట్ల, 11లక్షల, 11వేల లిఖిత రామ నామాలతో
సీతారాములను అభిషేకించిన రామకోటి రామరాజు
సిద్దిపేట జిల్లా జూన్ 11
గజ్వేల్ ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగా పండాలని, ప్రతి రైతు ఆనందంగా ఉండాలని కోరుతూ శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో అద్దాల మందిరం వద్ద మంగళవారం నాడు 11కోట్ల, 11లక్షల, 11వేల లిఖిత అమృత శ్రీరామ నామాలతో సీతారాములకు ప్రత్యేకంగా అభిషేకించి పూజించారు సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు .
ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసినట్లయితే పంటలు పండుతాయన్నారు. దీని ఆధారంగా వ్యవసాయం ముందుకు సాగుతుందన్నారు. దేశానికి రైతే వెన్నుముఖ. అలాంటి రైతు సుఖంగా జీవించకుంటే పరిపాలన కూడా ఆస్థవ్యస్థంగా మారుతుందన్నారు.
