ఆర్థిక సహాయం అందజేత
సిద్దిపేట్ జిల్లా జూన్ 6
గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ మండలం లోని మాందాపూర్ గ్రామనికి చెందిన లింగాల మహేశ్వరి వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు విషయం తెలుసుకున్న గువ్వ యువరాజు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆ కుటుంబానికి 50 కిలోల సన్న బియ్యం అందజేశారు.మరియు స్థానిక మాజీ సర్పంచ్ లింగాల బిక్షపతి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఆ కుటుంబనికి ₹2000/- అర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ బి ఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు లింగాల జహంగీర్, లింగాల పెద్దిరాజు, లింగాల నర్సిములు, చంద్రయ్య, గువ్వ నర్సిములు, శ్రీను, మల్లేష్, రమేష్, రాములు, నర్సిములు,గణేష్, విజయ్, సురేష్ యువకులు తదితరులు పాల్గొన్నారు.





