హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వినాయక దామోదర వీరసావర్కర్ జయంతి వేడుకలు
సిద్దిపేట్ జిల్లా మే 28
సిద్దిపేట జిల్లా అఖిల భారత విద్యార్థి పరిషత్ హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వినాయక్ దామోదర్ సావర్కర్ 141 జయంతి వేడుకలను పట్టణ కార్యదర్శి రాకేష్ నేతృత్వంలో వీర సావర్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవితమే స్వతంత్ర పోరాటం అని భరతమాత ముద్దుబిడ్డ దేశం కోసం 25 సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపిన గొప్ప స్వతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ లాంటి ఎందరో గొప్ప గొప్ప మహానీయుడని రచనతో ప్రసంగాల ద్వారా ప్రతి ఒక్కరిలో దేశభక్తిని రగిలించిన వీరుడని అన్నారు నేటి యువతకు వీరసావర్కర్ మార్గదర్శకంగా నిలిచారు సావర్కర్ పటిమస్ఫూర్తితో యువత మొత్తం అడుగుజాడల్లో నడవాలని కోరారు ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షుడు కన్వీనర్ సంతోష్ బాలు తదితరులు పాల్గొన్నారు
