Breaking News

 మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో నిరసన కార్యక్రమం

56 Views

కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా…

రాష్ట్రవ్యాప్త నిరసనకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు.!

*మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో నిరసన కార్యక్రమం

పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సన్న వడ్ల కు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా *నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ* ..

“రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఎట్లా ప్రకటిస్తది.?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ద్వారా తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి వంచించిందన్నారు.

“ఓట్లు డబ్బాలో పడంగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరింది. అందుకే నాలిక మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారు. ఇదే సన్న వడ్లకు మాత్రమే అనే మాట ఎన్నికలకు ముందు గనుక చెప్పుంటే కాంగ్రెస్ పార్టీని రైతులు చిత్తు చిత్తు చేసేవాళ్లు. ఇప్పటికీ ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారు. రైతు బంధు ఇయ్యక, రైతు భరోసా ఇయ్యకుండా రైతాంగాన్ని అన్నిరకాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నది.కాబట్టి

బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులపక్షాన నిలబడి కొట్లాడాలని *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు* పిలుపునిచ్చారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనడానికి నిర్లక్ష్యం వహిస్తూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తూ గోస పుచ్చుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించేదిశగా నిరసన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజూ వడ్ల కల్లాలకాడికి బీఆర్ఎస్ శ్రేణులు పోవాలని… రైతులకు అండగా నిలవాలని *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు రైతులకు, ప్రజలకు, కార్యకర్తలకు, పిలుపునిచ్చారు..

Oplus_131072
Oplus_131072
కుడుదుల కిరణ్ కుమార్ మంచిర్యాల్ మండల్