బీజేపీ అభ్యర్థి గెలిస్తేనే పార్లమెంట్ అభివృద్ది
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఈరోజు బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ తో కలిసి బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి హాజీపూర్ మండలంలోని వేంపల్లి గ్రామంలో బైక్ ర్యాలీ ప్రారంభించి మండలంలోని ప్రతి గ్రామానికి బైక్ ర్యాలీ ద్వారా వెళ్ళి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరొకసారి నరేంద్ర మోదీ గారిని ప్రధాన మంత్రిని చేయడానికి పెద్దపల్లి పార్లమెంట్ లో బీజేపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని తెలుపడం జరిగింది. పార్లమెంట్ లో కొనసాగుతున్న కుటుంబ పాలనను అంతం చేయాలని బీజేపీ అభ్యర్థి గెలిస్తే పార్లమెంట్ లో మన సమస్యల పై మన గొంతు అయ్యి వినిపించి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాడని తెలిపారు.
