ప్రాంతీయం

మరణించిన పోలీసులకు భద్రత చెక్ అందజేత

76 Views

రామగుండం పోలీస్ కమిషనరేట్

*గుండెపోటుతో మరియు నీటిలో మునిగి మరణించిన హెడ్ కానిస్టేబుల్ ల కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేత*

*పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం : పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,*

రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ డి. మల్లయ్య ARHC .2836 గారు కెనాల్ నీటిలో మునిగి మరణించగా ఆయన భార్య హేమలత , కుమార్తె శ్రీజ లకి భద్రత ఎక్స్గ్రేషియా చెక్ 8లక్షలు మరియు గోదావరిఖని 2టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ గుండెపోటు తో మరణించిన బి. సోమరాజు హెడ్ కానిస్టేబుల్ భార్య శోభరాణి, కుమార్తె సాయి ప్రియలకు లకి భద్రత ఎక్స్గ్రేషియా 15,99,160 లక్షల చెక్ ను ఈ రోజు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజీ) తన కార్యాలయం లో వారికి అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబ ప్రస్తుత స్థితిగతులను సీపీ అడిగి తెలుసుకోవడంతో పాటు, వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వపరంగా అందాల్సిన ఇతర బెనిఫిట్లను తక్షణమే అందజేసేవిదంగా చూస్తామని తెలియజేశారు. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం తో పాటు వారి కుటుంబాలకి అండగా ఉంటామని సీపీ అన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సురేంద్ర, ఏఓ అశోక్ కుమార్, సూపరింటెండెంట్ సంధ్య పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్