(తిమ్మాపూర్ ఏప్రిల్ 24)
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునుర్ గ్రామం లోయర్ మానేరు జిల్లాలో ఘటన
గుండ్లపల్లి లోని ఎస్ఆర్ కే స్కూల్ కరస్పాండెంట్ చాడ రంగారెడ్డి తన ఇద్దరి కొడుకులను తీసుకొని ఈతకు వెల్లిన రంగారెడ్డి
పెద్ద కుమారుడు కుమార్ జయ కౌసిక్ రెడ్డి 8 వ తరగతి,చిన్న కుమారుడు ఓమ్ జయ్ చైతన్య ఆనంద రెడ్డి 4వ తరగతి చదువుతున్నారు.
నీటిలో చిన్న కుమారుడు మునుగుతుంటే కాపాడే ప్రయత్నం చేయగా తండ్రి రంగారెడ్డి కూడా నీటిలో మునిగి మృతి చెందాడు.
పెద్ద కుమారుడు గడ్డకు వచ్చి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందిచాడు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తండ్రి కొడుకు ఇద్దరు మృతి చెందడంతో గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అమ్ముకున్నాయి…




