మెదక్ ఎంపీగా నీలం మధు గెలుపు ఖాయం – భాను ప్రకాష్ రావు
సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 19
రాబోయే ఎంపీ ఎన్నికల్లో నీలం మధు అఖండ విజయం ఖాయమని కప్పర భాను ప్రకాష్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాష్ రావు మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో మెదక్ ఎంపీ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు అఖండ విజయం ఖాయమని కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దశలు వారిగా నెరవేరుతాయని ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని బిఆర్ఎస్ పార్టీ, బిజెపి పార్టీ మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని రాబోయే ఎంపీ ఎన్నికల్లో దాదాపు 14 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తెలంగాణ లో గెలుస్తారని దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు





