ఏప్రిల్ 18, 24/7 తెలుగు న్యూస్:ఓపెన్ టు ఆల్ కబడ్డీ టోర్నమెంట్ లో భాగంగా సెమీ ఫైనల్ -1 మ్యాచ్ ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతలపల్లి జగదీశ్వర్ రావు.
చిన్నంబావి మండలం వెలగొండ గ్రామంలో శ్రీరామ నవమి సందర్బంగా ఓపెన్ టు ఆల్ కబడ్డీ టోర్నమెంట్ ను నిర్వహిచడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి గ్రామ కాంగ్రెస్ నాయకుల ఆహ్వానం మేరకు పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతలపల్లి జగదీశ్వర్ రావు.
ఈ ఓపెన్ టు ఆల్ కబడ్డీ పోటీలకు బహుమతులకు దాత గా సహకరించిన తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతలపల్లి జగదీశ్వర్ రావు కి శాలువా తో ఘనంగా సన్మానించారు.
అనంతరం ఈ కబడ్డీ టోర్నమెంట్ లో నాగర్ కర్నూల్ & తిమ్మాజిపేట్ సెమీ ఫైనల్ -1 మ్యాచ్ ను టాస్ వేసి ప్రారంభించారు. ఇరు జట్ల సభ్యులను కలిసి,కబ్బటి కబ్బడి అంటు కూతకు వెళ్లి ఇరు జట్ల ఆటగాళ్ళలో క్రీడా స్ఫూర్తిని నింపిన జగదీశ్వర్ రావు.క్రీడా ఆడాడం ద్వారా ఆరోగ్యం ఆహ్లాదకరంగా ఉంటుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చిన్నంబావి మండల మరియు వెల గొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




